25, మే 2010, మంగళవారం

మనిషి మనుగడకి భద్రత లేదా ...

కొద్ది రోజుల వ్యవధిలో మూడు వ్యధాభరిత సంఘటనలు ...
లైలా తుఫాన్, మంగళూరు విమాన ప్రమాదం,సంపాదకుడు ,సిని కవి,విమర్శకుడు వేటూరి మరణం..
వేటూరి జీవితంలో అన్ని చూసినవాడు,తను సాదించాలిసినది సాదించి మరణించాడు...ఇంకా కొంతకాలం జీవించి వుంటే తన సాహిత్య పరిమళాలను ఆస్వాదించే అవకాశం మనకి వుండేది...
వేటూరి మరణం కంటే ఎక్కువగా బాదించినది విమాన ప్రమాద సంఘటన ...లైలా తుఫాన్ మిగిల్చిన విషాదం.. రోజువారి పనుల మీద ఆడారపడే జీవితాలకు, రైతులకు కోలుకొని నష్టాన్ని మిగిల్చి జేవచ్చావాలుగా మార్చినది... ఏ ప్రభుత్వం వచ్చిన సామాన్య జీవికి, రైతుకు ఒరిగేదేమీ లేదు... నాయకుల ఓదార్పు యాత్రలు బాదితుల కస్టాలు తీర్చవు.. అధికార నాయకుల ఓదార్పు యాత్ర ... మరల అధికారాన్ని సొంతం చేసుకోవటానికి... ప్రతిపక్ష నాయకుల ఓదార్పు యాత్ర ...దూరమైన అధికారాన్ని తిరిగి పొందటానికి...; పాదయాత్రల,రధయాత్రల,ఓదార్పు యాత్రల అర్ధం ..పరమార్దం ఇంతే...
సామాన్య మానవుడికి ఒరిగేది ఏమిలేదు...వీళ్ళ యాత్రల , రోడ్ షోస్ వల్ల ఒకరోజు పని దండగ..ట్రాఫిక్ కి ఇబ్బంది...


మంగలూరు విమాన ప్రమాదం...అత్యంత దురదృష్టకరమైనది ...మాటలకందని విషాదం... ప్రమాదం జరిగాక వేసే నిజ నిర్దారణ కమిటీలు ....Exgracia లు ...ఇవేమీ పోయిన ప్రాణాలను తిరిగి తేలేవు...వీటికి పెట్టె ఖర్చుని ... నిర్మాణాల నాణ్యతకి...ప్రజల భద్రతకి పెడితే..ఇటువంటి విషాదాలను కొంతవరకైన ఆపవచ్చు కదా...కాని అలా చేస్తే... అక్రమంగా సంపాదించే అవకాశాన్ని మన నీతిమాలిన నాయకులు...అవినీతి అధికారులు కోల్పోతారుకదా...
పాలకుల్లో...పరిపాలనలో.. మార్పు రానంత వరకు..ఇలాంటి దురవార్తలు వింటూనే వుంటాము...

--Sri Kalyanapu
Ann Arbor, MI
05.25.2010

15, ఏప్రిల్ 2010, గురువారం

నిశబ్ద గీతం

కొద్ది క్షణాల పరిచయం.....
కాని .... కొన్ని యుగాల జీవితానికి సరిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించినది...
అంతలోనే ..... ఏమి జరిగిందో....
రంగు..రంగుల పుష్పాలతో హరివిల్లు లా ఉన్న బృందావనం ...
మరుభూమిగా మారిపోయింది....
గొంతు దాటి ...మనస్సులను గెలుచుకోవాల్సిన ...." మధుర గీతం.."
ఎప్పటికి గుండె దాటని "నిశబ్ద గీతంగానే" మిగిలిపోయింది.....చివరి మజిలీగా...చీకటి రాత్రిగా....
-- శ్రీ కళ్యాణపు
04.15.2010, Mcdonough,
GA,USA
.

14, ఏప్రిల్ 2010, బుధవారం

మౌనం గా...

నా చుట్టూ నన్ను కోరుకునే ప్రపంచం...ఒక వైపు...
నన్ను నన్నుగా గుర్తించే..స్నేహాలు ఒక వైపు...
ఆకాశమే హద్దుగా నన్ను ప్రేమించే ...నా కుటుంబం ఒక వైపు...
నీ ఆలోచనలతో...ప్రపంచానికి దూరంగా ...
కలల ...అలల వేగానికి బందీనై...
ఈ ప్రపంచపు ఎల్లలు దాటి...మరొక ప్రపంచపు... వినీలాకసంలో...రాలిపోని ద్రువతారనై...
నిన్ను నిన్నుగా ఆరాదించే...నిండు వెన్నెలను నేనై...
మౌనం గా...మనస్సు లోతుల్లో ....మరణించే వరకు...
ఒక్కడిగా...ఒంటరినై ...
మరొక లోకంలో నేను...

-- శ్రీ కళ్యాణపు

9, ఏప్రిల్ 2010, శుక్రవారం

జీవనది...

తను ప్రవహించే జీవనది...ఒయ్యారాల ఒగలు పోతూ...
నిశబ్ధాన్ని చీల్చుతూ...కష్ట,సుఖాలను తీర్చే.హృధయ కావేరి..
తన ప్రవాహపు గల గలలు..సిరి మువ్వల మంజీర నాధాలు...
పంట పొలాలను తన అమృత ధారతో పావనం చేసే ఆకాశ గంగా ప్రవాహిని..
కలల అలలలో ...కనుపాపల అంచులపై ...అలుపెరగక నర్తించే నిత్య నాట్య మయూరి...
అంతటి జీవనది ....
ఒక్కసారిగా ఆగ్రహించినది...
ప్రళయాన్ని పరిచయం చేస్తూ...కాలాన్ని,కలలను.వెనక్కు నెట్టి ...
జీవధారను...రుధిర ధార ఎందుకు చేసిందో..?
ఎవరికి తెలుసు...ఆగిపోయిన ప్రవాహానికి...కాలానికి...గుండె చప్పుడికి తప్ప...

--శ్రీనివాస్ కళ్యాణపు...
04.09.2010 , 1 am ,
Mcdonough, USA.

1, ఏప్రిల్ 2010, గురువారం

మనిషిగా బ్రతకలేమా ?

రాజ్యాన్ని జయించిన రాజైనా...ఆకలికి,దప్పికలకి బానిస కాక తప్పదు.మనిషి ఎంతో సాధినంచాను అని అనుకుంటున్న ఈ కాలంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి...ప్రపంచంలో ఎ మూలకి పోయినా.తాగు నీటికోసం మైళ్ళకి మైళ్ళు నడుస్తునే ఉన్నాడు..అంతర్గతంగా కొట్టుకుంటునే ఉన్నాడు.సరిఆయిన వైద్యం లేదు..ఉండటానికి సరియిన ఇల్లు లేదు ...ఒకరోజు పని లేకపోతే ఆ తరువాత రోజు పస్తులు ఉండే పరిస్థితి ఎన్నో చోట్ల కనిపిస్తున్నది.ఇవి అన్ని సాద్యమైనంత త్వరగా పరిస్కరించుకోవాలసిన సమస్యలు. ఇవన్ని
మరచి కొత్త సమస్యలను తెచ్చుకుంటున్నాము... మనం మనుషులుగా బ్రతుకుతున్నామా ?మతం మత్తులో ....కులం మత్తులో సాదించేదేమిటి? ఏ మతం హింసని కోరుకోలేదు..మరి మనిషిగా పుట్టి...జ్ఞానమున్న జంతువుగా పేరు పొందిన మనం ఎందుకు రక్తం తాగే అడవిమృగంలా ప్రవర్తిస్తున్నాము... ఎంత కాలం ఓట్ల కోసం జన హితం మరచి...అనాగరికముగా బ్రతుకుదాము...
అందరు విద్యావంతులు అయితే దేశం సుసంపన్నం అవుతుంది అంటారు ...మరి ఈ మారణ హొమాలని జరుపుతున్నది విద్యావంతులే కదా...
మతం..కులం సున్నితమైన అంశాలంటూ ఎంత కాలం ఈ నరమేదాన్ని బరిద్దాము...
తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవటానికి...లక్షలు ..కోట్లు పెట్టి..కమిటీలు వేసి...పోలీసు బలగాలను పెట్టి... పట్టుకుని , కోర్టు కి ఒప్ప జెప్పి ఉరి శిక్ష వేయిస్తే...చివరకి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టం... మరి న్యాయస్తానం ...ఈ కమిటీలు... పోలీసులు ఎందుకు...
రాజ్యాంగాన్ని మార్చాలంటే రాజకీయనాయకులకు భయం ...ఓట్లు పోతాయని....
అవినీతిని అంతం చేయాలి అంటే ....అధికారులకి భయం ... లంచం దొరకదేమో అని...
కనీసం ప్రజలు (అంటే మనం )అయినా మారతారా అంటే... మందుకి..కులానికి..మాతానికి..వర్గాలకి బానిసలు అయి...గొర్రెల్లా తల ఊపుతాం ..
రాజకీయాల్లోకి యువత రావాలి అంటారు .... మరి రాజకీయ వారసులకి తప్ప వేరే వాళ్లకి అవకాశం ఈ రాబందులు ఎక్కడ ఇస్తాయి..
"సునామి రావాలి.... ఒక ప్రాంతానికి కాదు....సమస్త భూమండలానికి ....ఒక్కసారిగా ...సర్వం పోయేలా ...
అప్పుడైనా ఈ భూమి కి ...దరిద్రాన్ని ...దరిద్రులను మోసే..బాద తప్పుతుంది...
మరల భూమిపై జీవి ఉద్భవించి....అనాగారికులుగా మారేదాకా ..... భూమికి..గాలికి..నీరుకి..ఆకాశానికి ...అగ్నికి ....విశ్రాంతి ఆయినా దొరుకుతుంది....

22, మార్చి 2010, సోమవారం

పరిమళ

ఊహల వినీలాకాశంలో వేగుచుక్కవు నీవైతే ...
నిశీద రాత్రిని చీల్చుతూ వెలుగునిచ్చే వెన్నెలను నేనౌవుతా...
భూమి ,ఆకాశాలను కలిపే సరిహద్దువు నీవైతే...
ప్రతి అణువుకు వెలుగునిచ్చే సూర్య కిరణం నేనౌవుతా ...
జన ,జీవుల అంతరంగం నీవైతే...
ఆశల ఊయలకు ఉదయించే చిగురుటాకును నేనౌవుతా ...
ఆ సేతు హిమాచల కీర్తి కిరీటం నీవైతే ...
అణువణువులో నిక్షిప్తమైన సూక్ష్మ రూపాన్ని నేనౌవుతా..
మాటను పాటగా మార్చే గాత్రం నీవైతే ...
ఈ అనంత కోటి విశ్వంలో ఉదయించే ఆశలకు గమ్యాన్ని నేనౌవుతా...
అలుపెరగని చిరునవ్వువి నీవైతే...
అర్దించే పెదవులకు ఆపన్న హస్తం అందించే చిరునామా నేనౌవుతా...
వికశించే జీవితాలకు "పరిమాళాన్ని" ఇచ్చే మంచి గంధం నేనౌవుతా..
-- శ్రీనివాస్ కళ్యాణపు

March 18th 2010,
Mcdonough,Georgia,USA

ఒక నువ్వు...

ఒక నువ్వు..
తోలిజామున వచ్చిన స్వప్నం...
వెన్నెల్లో నడుస్తూ ఉన్నావు...
నాతో మాత్లాడుతూ ఉన్నావు ...
కాని నేను ఏమి వినలేకపోతున్నాను...
నన్ను ఎవరో..దూరంగా తీసుకువేలుతున్నారు... నీ నుండి..
వాళ్ళు ఎవరో నాకు తెలియదు.....
కనీసం ఎప్పుడు కూడా చూచినట్లు గుర్తులేదు...
చాల దూరం..చెప్పలేనంత..
ఉహించనలవి కానంత...
ఊరి పొలిమేరలు దాటి ...
నదీ ...నాదాలు దాటి...
సముద్రాలు గూండా ప్రయాణించి...
ఎడారుల్లో ...ఇసుక తిన్నెల మీద...
పడుతూ ...లేస్తూ ..ఆకలి దప్పికలతో ...అలమటిస్తూ ఒక నేను...
ఒక్కసారిగా మెలకువ వచ్చినది..
జరిగిన స్వప్నం గుర్తుకు వచ్చినది..
"కలే" కదా అని అనుకున్నా...
కొన్నాళ్ళకి కాని తెలిసింది... అది కల కాదు నిజం అని....
-- శ్రీనివాస్ కళ్యాణపు.

March 5th 2010,
Mcdonough,Georgia

7, మార్చి 2010, ఆదివారం

ఓ శరత్కాల వెన్నెల...

చిరునవ్వుల సుగంధాల సెలయేటిలో..పయనించే ఓ నవ యౌవ్వనిక...
అనునిత్యం మధినేలుతూ,నవవసంతపు చిగురుటాకువై...
ప్రకృతి మెడలో వేసిన రంగులమాలికవై..
ఓ శరత్కాల వెన్నెలలా ...
వినువీధిన మెరిసిన గగనతారవై...
నన్నె వరించుటకు వచ్చిన గంధర్వ కన్యవై..
నా మధిలో నిలిచిన ఓ పారిజాత ప్రణయమా...
నిలువెల్లా నాలో నీవై..నిరంతరం నా అంతరంగంలో ...
చిరస్థాయి చిరునామాగా మారి..
చిరు దివ్వెల వెలుగులను నింపి..
నిత్యం మరొక నేనై..నాలో ఉంటావని..
ఆశిస్తూ..ఆహ్వానిస్తూ ....నీ కోసం ఎదురు చూసే... నీ వెన్నెల...

శ్రీనివాస్.కళ్యాణపు..
03.07.2010 8.15
PM,
Mcdonough, GA, USA.

1, మార్చి 2010, సోమవారం

నీ తొలిపరిచయ క్షణం..

నీ తొలిపరిచయ క్షణం..
ఉషోదయపు తొలికిరణ ప్రసరణ లోని తేజంవలె ఉన్నది..
కనులు మూస్తే ఆ కమనీయ దృశ్యం కనుమరు అవుతుందేమో అనిపిస్తుంది...
ఆ అనిర్వచనీయమైన అనుభూతి నూతన శ్వాసనిస్తుంది ...