25, మే 2010, మంగళవారం

మనిషి మనుగడకి భద్రత లేదా ...

కొద్ది రోజుల వ్యవధిలో మూడు వ్యధాభరిత సంఘటనలు ...
లైలా తుఫాన్, మంగళూరు విమాన ప్రమాదం,సంపాదకుడు ,సిని కవి,విమర్శకుడు వేటూరి మరణం..
వేటూరి జీవితంలో అన్ని చూసినవాడు,తను సాదించాలిసినది సాదించి మరణించాడు...ఇంకా కొంతకాలం జీవించి వుంటే తన సాహిత్య పరిమళాలను ఆస్వాదించే అవకాశం మనకి వుండేది...
వేటూరి మరణం కంటే ఎక్కువగా బాదించినది విమాన ప్రమాద సంఘటన ...లైలా తుఫాన్ మిగిల్చిన విషాదం.. రోజువారి పనుల మీద ఆడారపడే జీవితాలకు, రైతులకు కోలుకొని నష్టాన్ని మిగిల్చి జేవచ్చావాలుగా మార్చినది... ఏ ప్రభుత్వం వచ్చిన సామాన్య జీవికి, రైతుకు ఒరిగేదేమీ లేదు... నాయకుల ఓదార్పు యాత్రలు బాదితుల కస్టాలు తీర్చవు.. అధికార నాయకుల ఓదార్పు యాత్ర ... మరల అధికారాన్ని సొంతం చేసుకోవటానికి... ప్రతిపక్ష నాయకుల ఓదార్పు యాత్ర ...దూరమైన అధికారాన్ని తిరిగి పొందటానికి...; పాదయాత్రల,రధయాత్రల,ఓదార్పు యాత్రల అర్ధం ..పరమార్దం ఇంతే...
సామాన్య మానవుడికి ఒరిగేది ఏమిలేదు...వీళ్ళ యాత్రల , రోడ్ షోస్ వల్ల ఒకరోజు పని దండగ..ట్రాఫిక్ కి ఇబ్బంది...


మంగలూరు విమాన ప్రమాదం...అత్యంత దురదృష్టకరమైనది ...మాటలకందని విషాదం... ప్రమాదం జరిగాక వేసే నిజ నిర్దారణ కమిటీలు ....Exgracia లు ...ఇవేమీ పోయిన ప్రాణాలను తిరిగి తేలేవు...వీటికి పెట్టె ఖర్చుని ... నిర్మాణాల నాణ్యతకి...ప్రజల భద్రతకి పెడితే..ఇటువంటి విషాదాలను కొంతవరకైన ఆపవచ్చు కదా...కాని అలా చేస్తే... అక్రమంగా సంపాదించే అవకాశాన్ని మన నీతిమాలిన నాయకులు...అవినీతి అధికారులు కోల్పోతారుకదా...
పాలకుల్లో...పరిపాలనలో.. మార్పు రానంత వరకు..ఇలాంటి దురవార్తలు వింటూనే వుంటాము...

--Sri Kalyanapu
Ann Arbor, MI
05.25.2010